తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నిసార్లు లోపలేసినా... దర్జాగా దోచేస్తున్నారు...!

యువకుల గదులు, హాస్టల్లే వారి లక్ష్యం... సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు కొట్టేయటంలో సిద్ధహస్తులు.. ఠాణాలు వారికి విడిదిల్లులాంటివే... ఎన్ని కేసులు పెట్టినా... వారు మాత్రం తమ హస్తలాఘవాన్ని మాత్రం చూపిస్తున్నారు.

By

Published : Feb 8, 2019, 9:30 PM IST

వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!

మాదాపూర్​ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ల్యాప్​టాప్​లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లు, యువకుల గదులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.


మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో దుండగున్ని అరెస్ట్ చేశారు. 17 ల్యాప్​టాప్​లు, 25 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ఠాణాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.
వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!

ABOUT THE AUTHOR

...view details