తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయ్​' - telangana news today

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమం సైతం పూర్తైంది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్​ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని... పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ పేర్కొన్నారు. ఉదాహరణలతో సహా ఎన్నికల కమిషన్​కు రాసిన లేఖలో పోలింగ్​ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లు లేవని ప్రస్తావించారు.

There are mistakes in the MLC voters list in telangana
'ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయ్​'

By

Published : Mar 6, 2021, 2:29 AM IST

రెండు పట్టభద్రుల మండలి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్​కు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ లేఖ రాశారు. నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లు లేవని వివరించారు.

ఒక నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మరో నియోజకవర్గంలో ఉన్నారని.. ఉదాహరణలతో కూడిన వివరాలు లేఖలో ప్రస్తావించారు. ఆ తప్పులు ఓటర్ల జాబితా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ల జాబితాను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ఓటర్లకు పోలీంగ్​కు ముందు స్లిప్పులు పంపిణీ చేయడం సాధ్యం కాదని, పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. అందువల్ల ఓటింగ్ శాతం కూడా తగ్గే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి :రాహుల్ గాంధీతో భేటీ అయిన మధు యాష్కీ

ABOUT THE AUTHOR

...view details