తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదు' - The Yuga Tulsi Foundation has called for a 'Go Sadak Bandh'

ఈ నెల 8న 'గో సడక్ బంద్​'కు యుగ తులసి ఫౌండేషన్ పిలుపునిచ్చింది. ఎల్బీనగర్​లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. వనస్థలిపురంలో శోభాయాత్ర నిర్వహించారు.

The Yuga Tulsi Foundation has called for a 'Go Sadak Bandh' on the 8th of this month in lb nagar
'స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎల్బీనగర్ నుంచి కదిలేది లేదు'

By

Published : Jan 6, 2021, 6:49 PM IST

ప్రతి ఒక్క హిందూ బంధువు గో సడక్ బంద్​ను విజయవంతం చేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వనస్థలిపురంలో.. యుగ తులసి ఫౌండేషన్, జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గణేష్ టెంపుల్ వరకు శోభాయాత్రను నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ..

ఈ నెల 8న ఎల్బీనగర్​లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. గో హత్యలను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య నిషేధంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎల్బీనగర్ నుంచి కదిలేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు బి.యన్.రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం భక్త సమాజం, గో భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు లేవు : తలసాని

ABOUT THE AUTHOR

...view details