తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సమయంలో.. నవజాత శిశువులపై సదస్సు - నేషనల్ నియోనాటల్ ఫోరమ్ తెలంగాణ శాఖ

నేషనల్ నియోనాటల్ ఫోరమ్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో వెబినార్ జరిగింది. నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పలువురు చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. కరోనా సమయంలో నవజాత శిశువులకు సంబంధించి.. వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రతి సవాళ్లపై చర్చించారు.

National Neonatal Forum
నవజాత శిశువులపై సదస్సు

By

Published : May 16, 2021, 10:17 PM IST

తల్లికి లేదా నవజాత శిశువుకు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై.. నేషనల్ నియోనాటల్ ఫోరమ్ తెలంగాణ శాఖ వెబినార్ నిర్వహించింది. నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరమ్ అధ్యక్షుడు డా.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డా.రమేశ్​లతో పాటు.. పలువురు చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రౌచర్​ను విడుదల చేశారు.

నవజాత శిశువులపై సదస్సు
నవజాత శిశువులపై సదస్సు
నవజాత శిశువులపై సదస్సు

కరోనా సమయంలో నవజాత శిశువులకు సంబంధించి వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రతి సవాళ్లపై ఈ సదస్సులో చర్చించారు. తల్లికి కరోనా సోకిన సమయంలో.. శిశువును చూసుకునే విధానాన్ని వైద్యులు వివరించారు.

ఇదీ చదవండి:కరోనా లేని గ్రామం ఎక్కడుందో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details