తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 7:17 PM IST

ETV Bharat / state

జయరాం హత్య కేసు నిందితుడి పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్​ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్​ కాపీని అందజేయాలన్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

the accused in the Jayaram murder case
జయరాం హత్య కేసు నిందితుడి పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్​ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్దా బోస్​ల ధర్మాసనం విచారణ జరపగా... కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

కౌంటర్ కాపీ తమకు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. కాపీని అందజేయాలన్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details