గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడినవారు, నవంబర్ ఒకటో తేదీ తర్వాత కొవిడ్ నిర్ధరణ అయిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అందుకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు, జారీ గడువులను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్ఈసీ - బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు , జారీ గడువులను ఎస్ఈసీ సవరించింది. పోలింగ్ తేదీకి నాలుగు రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది.
![పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్ఈసీ Extension of deadline for postal ballot vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9651815-192-9651815-1606228510427.jpg)
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్ఈసీ
పోలింగ్ తేదీకి నాలుగు రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. అటు పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఇవీ చూడండి: బల్దియా పోరులో సై అంటున్న విద్యావంతులు
Last Updated : Nov 24, 2020, 8:07 PM IST