విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్ చేస్తామని ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్రావు వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సెకండ్వేవ్లో సుమారు 3 వేల మంది విద్యుత్ సిబ్బంది కరోనా బారినపడ్డారని.. రెండు దశల్లో ఇప్పటి వరకు 80 మంది మరణించారని సీఎండీ తెలిపారు.
విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్రావు - prabhakar rao latest news
నిమ్స్ ఆసుపత్రికి విద్యుత్ శాఖ 10 వెంటిలేటర్లను సమకూర్చింది. ఇందుకు సంబంధించిన రూ.70 లక్షల చెక్కును నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్కు ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్రావు అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
![విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్రావు విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11944720-686-11944720-1622287149667.jpg)
విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్రావు
సామాజిక బాధ్యతలో భాగంగా విద్యుత్ శాఖ తరఫున నిమ్స్ ఆసుపత్రికి 10 వెంటిలేటర్లు సమకూర్చారు. అందుకు సంబంధించిన రూ.70 లక్షల చెక్కును నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్కు ప్రభాకర్రావు అందజేశారు.
ఇదీ చూడండి: gangula: లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్: మంత్రి గంగుల
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు