తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 6:03 PM IST

Updated : Apr 3, 2020, 6:08 PM IST

ETV Bharat / state

మోదీ జిమ్మిక్కులతో జీవితాలు మారవు: అసదుద్దీన్

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఎంఐఎం ఆధ్యక్షుడు అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ప్రధానిపై ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

'ప్రణాళిక లేని లాక్​ డౌన్​ కారణంగా ఇబ్బందులు పడేది పేదలే'
'ప్రణాళిక లేని లాక్​ డౌన్​ కారణంగా ఇబ్బందులు పడేది పేదలే'

దేశంలోని ప్రజలంతా ఆశలు, ఆకాంక్షలు ఉన్నవారేనని అసదుద్దీన్ అన్నారు. 9 నిమిషాల జిమ్మిక్కులకు ప్రజల జీవితాలను పరిమితం చేయాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న తోడ్పాటు, పేదలకు అందుతున్న సాయం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. సాయం గురించి చెప్పకుండా ప్రధాని కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

సాయమడిగితే.. దీపాలు ఆర్పమంటున్నారు...

'ప్రణాళిక లేని లాక్​ డౌన్​ కారణంగా ఇబ్బందులు పడేది పేదలే'

దేశంలో లక్షల మంది పేదలు ఆకలితో ఉన్నారని అసదుద్దీన్ గుర్తు చేశారు. ప్రణాళిక లేని లాక్‌డౌన్‌ వల్ల పేదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వలస కార్మికులు తమ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని సీఎంలు కోరుతుంటే... దీపాలు ఆపేయమనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

ఇవీ చూడండి : పీఎం కేర్స్​కు బండి సంజయ్​ భారీ విరాళం

Last Updated : Apr 3, 2020, 6:08 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details