తెలంగాణ

telangana

ETV Bharat / state

సాఫ్ట్​వేర్ మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు - సాఫ్ట్​వేర్ మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

గత నెల 26 నుంచి కనిపించకుండా పోయిన సాఫ్ట్​వేర్ మహిళ రోహిత కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ఆమె పుణెలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తాను ఇష్టవూర్వకంగానే ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు రోహిత తెలిపారు.

Softwear
Softwear

By

Published : Jan 15, 2020, 3:10 PM IST

Updated : Jan 15, 2020, 7:57 PM IST

గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గత నెల డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన సాఫ్ట్​వేర్ మహిళ రోహిత కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రోహిత... పుణెలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాకపోతే... రోహిత హైదరాబాద్ వచ్చేందుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని పోలీసులు రోహిత కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఎవరూ కిడ్నాప్​ చేయలేదు: రోహిత

తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని... ఇష్టపూర్వకంగానే పుణెకు వెళ్లినట్లు సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని రోహిత తెలిపారు. పుణెలో ఉద్యోగం కోసం యత్నిస్తుండగా తనపై అదృశ్యం కేసు నమోదైందని తెలిపింది.

సాఫ్ట్​వేర్ మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చూడండి: రాజ్​భవన్... ప్రజాభవన్: సంక్రాంతి వేడుకల్లో గవర్నర్

Last Updated : Jan 15, 2020, 7:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details