తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్​ జలసౌధ వేదికగా ఉదయం 11 గంటలకు బోర్డు భేటీ అవనుంది.

By

Published : Aug 9, 2019, 6:31 AM IST

కృష్ణానదీ యాజమాన్య బోర్డు

నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్​ జలసౌధ వేదికగా నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. 11 గంటలకు బోర్డు సమావేశం ప్రారంభం అవనుంది. ఛైర్మన్ ఆర్కేగుప్తా అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం, ఇతర సభ్యులు, ఇంజినీర్లు పాల్గొంటారు.

ఏడు అంశాలపై

సమావేశ ఎజెండాలో మొత్తం ఏడు అంశాలను పొందుపర్చారు. 2019-20 సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకం, బోర్డు నిర్వాహణ నియమావళిపై ప్రధానంగా చర్చిస్తారు. వీటితో పాటు టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు, బోర్డును విజయవాడకు తరలించడం, బోర్డు నిర్వాహణకు ఇరురాష్ట్రాల నుంచి నిధుల విడుదల తదితర అంశాలపై చర్చిస్తారు. చిన్ననీటి వనరులకు నీటి వినియోగం, జలాల మళ్లింపు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details