తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 10:30 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదీలీ

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

The government has issued orders transferring five IPS officers in ts state
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదీలీ చేస్తూ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదీలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణుగూరులో ఖాళీగా ఉన్న ఏఎస్పీ పోస్టుకు 2017 బ్యాచ్​కు చెందిన శబరీశ్​ను నియమించింది.

ఏటూరు నాగారం ఏఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్​ను రామగుండం అదనపు డీసీపీగా బదిలీ చేసి ఆ స్థానంలో గౌస్ అలాంను నియమించింది. భద్రాచలం ఎఎస్పీగా ఉన్న రాజేశ్​ చంద్రను ఆదిలాబాద్ ఏఎస్పీగా బదిలీ చేసి ఆ స్థానంలో 2017 బ్యాచ్​కు చెందిన వినీత్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details