తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలు ఆహార పొట్లాలు పంచిపెట్టిన సీపీ అంజనీకుమార్​

లాక్​డౌన్​ నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న వలసకూలీలు, నిరుపేదలను ఆదుకోవడానికి పోలీసులు మందుకొస్తున్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని నివసిస్తున్న కొంద మంది పేదలకు సీపీ అంజనీకుమార్​ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

By

Published : Mar 28, 2020, 5:06 PM IST

The food was distributed to the daily laborers by CP Anjanekumar at Hyderabad banjarahills
నిరుపేదలు ఆహారపొట్లాలు పంచిపెట్టిన సీపీ అంజనీకుమార్​

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నగర సీపీ అంజనీ కుమార్ నిరుపేదలు, వలస కూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నగరంలో లాక్​డౌన్ కొనసాగుతున్నందున కూలీలకు ఆహారం అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి దానం నాగేందర్ నివాస ప్రాంతంలో పేదలు, వలస కూలీలు ఉన్నందున వారికి ఆహారం పంపిణీ చేశారు. అనంతరం వారి వివరాలు, ఎదుర్కొంటున్న సమస్యలను సీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ కళింగరావు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలు ఆహారపొట్లాలు పంచిపెట్టిన సీపీ అంజనీకుమార్​

ABOUT THE AUTHOR

...view details