తెలంగాణ

telangana

ఆదిత్య కన్​స్ట్రక్షన్స్​తోపాటు ప్రొప్రయిటర్​పై కూడా సీబీఐ కేసు

By

Published : Mar 25, 2021, 10:33 PM IST

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిత్య కన్​స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు దాని ప్రొప్రయిటర్ మద్దాల రమేశ్​రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పాన్ నంబర్లు, డాక్యుమెంట్లు కూడా సమర్పించినట్లు ఫిర్యాదు నమోదైంది.

Case against on aditya construction
Case against on aditya construction

బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై ఆదిత్య కన్​స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు దాని ప్రొప్రయిటర్ మద్దాల రమేశ్​రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. క్లియర్ టైటిల్ లేని భూములు తాకట్టుపెట్టి బ్యాంకు నుంచి రూ. 11 కోట్ల 39 లక్షల రుణాలు తీసుకొని ఎగవేసినట్లు నిందితులపై అభియోగం.

తప్పుడు పాన్ నంబర్లు, డాక్యుమెంట్లు కూడా సమర్పించినట్లు యూబీఐ ఫిర్యాదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్​లోని సీబీఐ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చూడండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

ABOUT THE AUTHOR

...view details