తెలంగాణ

telangana

ETV Bharat / state

'డిగ్రీలో ఏ కోర్సు చదివినా పీజీలో ఆర్ట్స్.. సోషల్ సైన్సెస్ కోర్సుల్లో చేరవచ్చు'

డిగ్రీలో ఏ కోర్సు చదివినా పీజీలో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో చేరేందుకు అర్హత కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటి వరకు డిగ్రీలో సంబంధింత సబ్జెక్టు చదివి ఉంటేనే పీజీలో దానికి సంబంధించిన కోర్సులో చేరేందుకు అర్హత ఉంది.

By

Published : May 16, 2022, 10:41 PM IST

ఉన్నత విద్యా మండలి
ఉన్నత విద్యా మండలి

డిగ్రీలో ఏ కోర్సు చదివినా పీజీలో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో చేరేందుకు అర్హత కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటి వరకు డిగ్రీలో సంబంధింత సబ్జెక్టు చదివి ఉంటేనే పీజీలో దానికి సంబంధించిన కోర్సులో చేరేందుకు అర్హత ఉంది. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారెవరైనా చేరేలా మార్పులు చేయాలని ఈరోజు వీసీల సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

పీజీ ప్రవేశాల్లో ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరని కళాశాలలు, కోర్సులను మూసివేయాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలో సుమారు 250 డిగ్రీ, పీజీ కాలేజీలు మూత పడే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు న్యాక్ గుర్తింపు పొందేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. న్యాక్ గుర్తింపు పొందేందుకు లక్ష రూపాలయ ఆర్థిక సాయంతో పాటు.. అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి వీసీలకు తెలిపారు.

డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపుపై ఈనెల 20న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో విదేశీ భాషల కోర్సులు ప్రవేశ పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సులకు ఉమ్మడి విద్యా సంవత్సరం అమలు చేయనున్నట్లు లింబాద్రి తెలిపారు. సమావేశంలో ఓయూ, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :జూన్ 15న ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు షురూ

బస్సు ఎక్కలేరు.. బడికి వెళ్లలేరు.. పనీ ఇవ్వరు.. మరుగుజ్జుల దీనగాథ!

ABOUT THE AUTHOR

...view details