తెలంగాణ

telangana

చిత్రకళాఖండాల ప్రదర్శనను ప్రారంభించిన ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్

బంజారాహిల్స్‌లోని డయిరా ఆర్ట్‌ గ్యాలరీలో రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్​.ఎస్.​ ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ చిత్రకళాఖండాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రవీణ్​కుమార్ సతీసమేతంగా ప్రారంభించారు.

By

Published : Apr 14, 2021, 9:16 PM IST

Published : Apr 14, 2021, 9:16 PM IST

ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్
ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డయిరా ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాఖండాల ప్రదర్శనను రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్​.ఎస్.​ ప్రవీణ్‌కుమార్ దంపతులు ప్రారంభించారు. ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

తన జీవితానుభవాలకు రూపమిచ్చిన సుమారు 31 చిత్తరువులు అపురూపంగా ఉన్నాయని ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను తల్లిదండ్రులే ప్రారంభించడం ఆనందంగా ఉందని కళాకారిణి స్వేచ్ఛ.. సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహించిన గురువుతోపాటు కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: భగత్​ను‌ గెలిపిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details