ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యులు విడుదలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని భావిస్తోంది.
స్థానిక సమరం: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం? - local body election schedule release in ap
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో... ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ వైకాపా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన చేస్తోంది.
![స్థానిక సమరం: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం? the-ap-government-is-planning-to-go-to-the-supreme-court-as-it-is-not-possible-to-hold-elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10173487-286-10173487-1610154514387.jpg)
స్థానిక సమరం: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం?
పంచాయితీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేయటంతో పాటు రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందంటూ ప్రోసీడింగ్స్ జారీ చేయటంపై ఏపీ ప్రభుత్వం ఈ కార్యాచరణ చేపట్టనుంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న కారణంగా.. జగన్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుందని సమాచారం.
ఇదీ చదవండి:ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్