హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధార్మికభూషన్ -2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీనటుడు సుమన్ హాజరయ్యారు. నటుడిగా తాను ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ అన్నమయ్యచిత్రంలో పోషించిన వెంకటేశ్వరస్వామి పాత్ర ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయనృత్యాలతో ఆకట్టుకున్నారు. నిర్వహకులు సుమన్ సహా పలువురిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.