తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 6:37 PM IST

ETV Bharat / state

నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్

గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం టీజీసెట్​ను నవంబరు 1న నిర్వహించాలని నిర్ణయించారు. నవంబరు 1న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టీజీసెట్ పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్
నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం టీజీసెట్ పరీక్ష షెడ్యూల్​ను ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 12న జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడింది.

నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్

సుదీర్ఘ తర్జన భర్జనలతో...

నాలుగు గురుకుల సొసైటీల్లోని 48 వేల 240 సీట్ల కోసం లక్ష 48 వేల 168 మంది దరఖాస్తు చేసుకున్నారు. పదేళ్ల వయసు విద్యార్థులు అర్హులు కాబట్టి.. కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించాలా వద్దా అని సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత.. నవంబరు 1న పరీక్ష జరపాలని నిర్ణయించారు.

ఆ తేదీల్లో డౌన్​లోడ్...

అక్టోబరు 15 నుంచి 31 వరకు వెబ్​సైట్​ల నుంచి హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ జాగ్రత్తలతో పరీక్షకు ఏర్పాట్లు చేస్తామని కన్వీనర్ స్పష్టం చేశారు.

నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్

ఇవీ చూడండి : గేరు మారిన వాహన రంగం- పెరిగిన విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details