తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ అభివృద్ధే లక్ష్యం

మేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్​ కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంలో ప‌నిచేసే వివిధ కేట‌గిరిల‌ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కింద‌కు తెచ్చి రెండు కొత్త విభాగాల‌ను ఏర్పాటు చేసే తీర్మానానికి ఆమోదించారు.

By

Published : Feb 15, 2019, 6:12 AM IST

Updated : Feb 15, 2019, 9:07 AM IST

బొంతు రామ్మోహన్​

గ్రేటర్​ అభివృద్ధే లక్ష్యం
హైద‌రాబాద్​లో ప్రతి జోన్ ప‌రిధిలో క‌నీసం మూడు మేజ‌ర్ థీమ్ పార్కుల‌ను నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. నగ‌రంలో ఖాళీగా ఉన్న స్థలాల‌ను గుర్తించి వాటిలో పార్కుల‌ను ఏర్పాటు చేయ‌డానికి వ‌చ్చే స్టాండింగ్ క‌మిటీలో ప్రవేశ‌పెట్టాల‌ని నిర్ణయం తీసుకున్నారు. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జ‌రిగింది.

జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంలో ప‌నిచేసే వివిధ కేట‌గిరిల‌ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కింద‌కు తెచ్చి రెండు కొత్త విభాగాల‌ను ఏర్పాటు చేసే తీర్మానానికి ఆమోదించారు. అంబ‌ర్‌పేట్ 6వ నెంబ‌ర్ జంక్షన్ నుంచి కాలా బ్రిడ్జి వ‌ర‌కు 3.85 కోట్ల రూపాయలతో స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాద‌న‌ల‌కు ఆమోద ముద్ర వేశారు. మెజంజాహి మార్కెట్‌లో మాంసం మార్కెట్ బ్లాక్‌ల పున‌రుద్ధర‌ణ‌ నిర్మాణాల‌ను 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేప‌ట్టే పనులకు ఆమోదించింది.

Last Updated : Feb 15, 2019, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details