తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్టడీకి నౌహీరా - సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా

హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన నౌహీరా షేక్‌ను ఈ రోజు నుంచి సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు.

సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా

By

Published : Feb 19, 2019, 7:22 AM IST

Updated : Feb 19, 2019, 7:56 AM IST

సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా
హీరా కుంభకోణం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే సంచలనం సృష్టించింది. నౌహీరా షేక్​ బంగారం పేరిట పెట్టుబడులను స్వీకరించి మదుపరులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడింది. ఇప్పటికే ఆమెపై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులో భాగంగా నౌహీరాను సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు. నాంపల్లి న్యాయస్థానం కస్టడీకి అనుమతించటంతో చంచల్​గూడ మహిళా జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. లక్షన్నర మంది హీరా గ్రూప్స్​లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 6వేల కోట్ల రూపాయలు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితురాలిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 19, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details