తెలంగాణ

telangana

By

Published : May 22, 2021, 5:35 PM IST

ETV Bharat / state

నేడు చేరుకోనున్న పదో ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​

రాష్ట్రానికి పదో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్​ సనత్​నగర్​కు చేరుకోనుందని... రైల్వే శాఖ తెలిపింది. ఒడిశాలోని రూర్కేలాలో 6 కంటయినర్‌ ట్యాంకర్లలో 118.93 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్​ను నింపుకుని రైలు బయలుదేరినట్లు పేర్కొంది.

Tenth Oxygen Express arriving to Hyderabad today
రాష్ట్రానికి చేరుకోనున్న పదో ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​

భారతీయ రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు నిరంతరాయంగా ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. రాష్ట్రానికి పదో ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​ ఒడిశాలోని రూర్కేలాలో 6 కంటయినర్‌ ట్యాంకర్లలో 118.93 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్​ను నింపుకుని హైదరాబాద్​కు బయలుదేరినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇవాళ రాత్రి ఏడు గంటలకు సనత్​నగర్ కు చేరుకుంటుందని వెల్లడించింది.

రాష్ట్రానికి చేరుకోనున్న పదో ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​

మరోపక్క రెండు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్​లు ఇవాళ ఏపీలోని గుంటూరు, కృష్ణపట్నంకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్​కు నాల్గవ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి... ఐదో ఎక్స్‌ప్రెస్‌ ఒడిశాలోని రూల్కేలా నుంచి చేరుకున్నాయి. భారతీయ రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక గ్రీన్‌ కారిడార్లలో నడుపుతున్నందువన అవి గమ్య స్థానానికి తక్కువ సమయంలోనే చేరుకుంటున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'

ABOUT THE AUTHOR

...view details