వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం కరపత్రాలను సిద్ధం చేసింది. తిరుపతి లోక్సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటికీ.. వీటిని చేరవేసే ప్రణాళిక రచించింది. అక్రమాస్తులు సహా ఇతర కేసుల మాఫీల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పార్లమెంట్ సభ్యులను తాకట్టుపెట్టిందని కరపత్రంలో పొందుపరిచారు. అధికార పార్టీని ఓడించి.. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలనే నినాదంతో తయారు చేసిన ఈ కరపత్రాలను... ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
పెరిగిన ధరలపై..