తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీజీపీఏ మద్ధతు'

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంపూర్ణ మద్ధతును ప్రకటించింది. మద్ధతు తీర్మాన ప్రతిని ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అందజేశారు‌. సర్వీసు నిబంధనలు, పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

By

Published : Mar 12, 2021, 9:18 AM IST

TGPA support for Trs MLC candidates
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీజీపీఏ మద్ధతు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు వాణి దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్టిలకు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంపూర్ణ మద్ధతును ప్రకటించింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావును ఆ సంఘ నేతలు ఆయన నివాసంలో కలిశారు.

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంఘం మద్ధతు తెలుపుతూ చేసిన తీర్మాన ప్రతిని హరీశ్​కు అందజేశారు‌. తమ సర్వీసు నిబంధనలు, పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు.

ఇదీ చూడండి:విశాఖ ఉక్కుపై కేటీఆర్‌ వ్యాఖ్యలు శుభపరిణామం: చాడ

ABOUT THE AUTHOR

...view details