తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2020, 4:25 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : సర్పంచ్​ల సంఘం

గ్రామాల్లో ఎల్​ఈడీ బల్బుల ఏర్పాటును ప్రైవేట్ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో ఉన్న పంచాయతీరాజ్​ కార్యాలయంలో కమిషనర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

telangana sarpanch unoion demands to cancel contract of led bulbs to private company
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : వెంకటేశ్ యాదవ్

గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తెలంగాణ సర్పంచుల సంఘం తప్పుబట్టింది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లో పంచాయతీరాజ్​ కమిషనర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పనులకు నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉపసర్పంచ్​కు ఉన్న చెక్​ పవర్​ను రద్దు చేయాలని కోరారు. గ్రామాలకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కమిషనర్​ను కోరామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:బంగారు తెలంగాణ కేసీఆర్​ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం

ABOUT THE AUTHOR

...view details