తెలంగాణ సంప్రదాయ రుచుల స్టాళ్లు ఏర్పాటు తెలంగాణ పిండివంటకాలైన అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు వంటి రుచులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా రాష్ట్ర పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని హరిత రెస్టారెంట్లో పిండివంటకాల స్టాల్స్ను పర్యాటక కార్పొరేషన్ ఛైర్మన్ భూపతిరెడ్డి, ప్రారంభించారు. నిర్వాహకులు ప్రత్యేక మిఠాయిలతో పాటు, సంప్రదాయ వంటకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు.
చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం
పిండి వంటకాల తయారీని చిన్న పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పర్యాటక అభివృద్ధి శాఖ ఛైర్మన్ భూపతిరెడ్డి అన్నారు. స్వచ్ఛమైన రుచుల వల్ల ఆరోగ్యంగా ఉంటామని అభిప్రాయపడ్డారు. పుల్లారెడ్డి మిఠాయిలు ఏ విధంగా విదేశాలకు ఎగుమతి చేసేవారో... అలాగే తెలంగాణ వంటకాలు సైతం ఎగుమతి చేసేలా పర్యాటక శాఖ కృషి చేస్తోందని ఎండీ మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'సమష్టి కృషితో బోనాలను ఘనంగా నిర్వహిద్దాం'