తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు

Telangana Legislative Council : శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు శాసనమండలి అంశం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. పెద్దల సభలో బీఆర్‌ఎస్‌కు పూర్తి అధిక్యం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు.

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 3:56 PM IST

Updated : Dec 4, 2023, 4:40 PM IST

Congress Wins in Telangana Elections 2023
Telangana Legislative Council

Telangana Legislative Council : తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress Party) పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. ఇప్పుడు శాసనమండలి అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్దల సభలో భారత రాష్ట్ర సమితికి పూర్తి ఆధిక్యం ఉండగా, శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

సీఎంగా రేవంత్​ రెడ్డి - రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం

Congress Wins in Telangana Elections 2023 :రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీచేసి గెలుపొందారు. దీంతో వారు శాసన మండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరిలో బీఆర్‌ఎస్‌(BRS) నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన శాసన సభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్), పాడి కౌశిక్ రెడ్డి(హుజూరాబాద్) పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(జనగామ) ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం - భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Congress Latest News :ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బీజేపీకి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. మిగిలిన 28 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో మండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు.

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండలి సభానాయకుడు అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సభా నాయకుణ్ణి చేసే పరిస్థితి ఉంది.

ఎన్నో ఏళ్ల తర్వాత దక్కిన విజయం - ఆ నియోజకవర్గాల్లో గెలుపు కాంగ్రెస్​కు చాలా స్పెషల్

Last Updated : Dec 4, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details