తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 7:08 PM IST

ETV Bharat / state

గురుకుల విద్యార్థులకు తెలంగాణ జాగృతి చేయూత

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఆన్​లైన్ తరగతుల కోసం హైదరాబాద్​లో తెలంగాణ జాగృతి సంస్థ 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను బహుకరించింది. ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల బృందాలతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్​కు వీటిని అందచేసింది.

గురుకుల విద్యార్థులకు తెలంగాణ జాగృతి 50 కంప్యూటర్లు, 500 కుర్చీల బహుమతి
గురుకుల విద్యార్థులకు తెలంగాణ జాగృతి 50 కంప్యూటర్లు, 500 కుర్చీల బహుమతి

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆన్​లైన్ తరగతుల కోసం తెలంగాణ జాగృతి సంస్థ 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను బహుకరించింది. ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల బృందాలతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్​కు వీటిని అందించినట్లు తెలంగాణ జాగృతి సంస్థ ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ వెల్లడించారు.

పేద విద్యార్థుల కోసమే...

కంప్యూటర్లు, ట్యాబ్​లు కొనలేని పేద విద్యార్థులు ఆన్​లైన్ చదువుకు దూరం కాకుండా ఉండాలని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కవిత చెప్పినట్లు సాగర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.

ఇవీ చూడండి : తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్​

ABOUT THE AUTHOR

...view details