తెలంగాణ

telangana

ETV Bharat / state

'తప్పుడు బిల్లులు పెట్టిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోండి' - telangana high court on niloufer hospital food contractor

నిలోఫర్‌ ఆసుపత్రిలో భోజనం సరఫరాలో కాంట్రాక్టర్ అక్రమాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని.. ఆ మేరకు సెప్టెంబర్​ 16 లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

niloufer hospital food contractor fraud
'తప్పుడు బిల్లులు పెట్టిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోండి'

By

Published : Aug 19, 2020, 3:22 PM IST

నిలోఫర్‌ ఆసుపత్రిలో భోజనం సరఫరాలో కాంట్రాక్టర్ అక్రమాలపై దర్యాప్తు జరపాలని హైకోర్టులో వేసిన పిల్​పై బుధవారం విచారణ జరిగింది. కాంట్రాక్టర్ సురేష్​ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలని పిల్​లో పేర్కొనగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్​ కాంట్రాక్టర్​పై విచారణ నివేదికను సమర్పించారు. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదిక పేర్కొంది. నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్​పై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.

ఇదే కాంట్రాక్టర్​ను గాంధీ, ఛాతీ ఆసుపత్రుల్లోనూ ఎలా కొనసాగిస్తున్నారని హైకోర్టు మండిపడింది. కాంట్రాక్టర్​పై రెండు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సురేష్​పై తీసుకున్న చర్యలను సెప్టెంబర్​ 16 లోగా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం సర్కారుకు సూచించింది.

ఇదీ చూడండి:నోయిడా పవర్​ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details