హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు తెరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెట్రో రైలు, షాపింగ్ మాల్స్ తెరిచినప్పుడు... పార్కులు తెరిచేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చినప్పటికీ.. పార్కులను ఎందుకు తెరవడం లేదని అడిగింది.
కేబీఆర్ పార్కు తెరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... బంజారాహిల్స్కు చెందిన డాక్టర్ జయంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం ప్రకటించిన అన్లాక్-4లో పార్కుల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ.. పార్కు తెరవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాలకృష్ణ వాదించారు.