తెలంగాణ

telangana

ETV Bharat / state

దర్శకుడు శంకర్​కు భూమి ఎందుకు కేటాయించారు. - undefined

దర్శకుడు ఎన్​.శంకర్​కు భూమి ఎందుకు కేటాయించారో పూర్తి వివరాలు తెలియజేయాలంటూ. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది జూన్​21న 5 ఎకరాలు కేటాయిస్తూ. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 75ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

TELANGANA HIGH COURT ISSUED NOTICE TO GOVERNMENT FOR DIRECTOR N SHANKER LAND
TELANGANA HIGH COURT ISSUED NOTICE TO GOVERNMENT FOR DIRECTOR N SHANKER LAND

By

Published : Jan 31, 2020, 6:31 AM IST

Updated : Oct 17, 2022, 3:44 PM IST


సినీ దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్​కు భూమిని కేటాయించటంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకిల్లాలో ఎకరా రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను శంకర్​కు ప్రభుత్వం కేటాయించింది. గతేడాది జూన్ 21న ప్రభుత్వం జారీ చేసిన జీఓ 75ను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాలకు చెందిన జె.శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

రూ. 5 కోట్లది 5 లక్షలకే...

పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రిజిస్టర్ విలువ ఎకరా రూ.20 లక్షల వరకు ఉంటుందన్నారు. మార్కెట్ విలువ రూ.5 కోట్లదాక ఉండగా... ప్రభుత్వం కేవలం రూ.5 లక్షలకే కేటాయించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం తనకు నచ్చిన వారికి ప్రజల భూమిని కేటాయించరాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్.ఎం.డీ.ఎ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ, దర్శకుడు ఎన్.శంకర్​కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Oct 17, 2022, 3:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details