తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల పరిశోధనలు ఆగకూడదు: గవర్నర్ తమిళిసై

ఆవిష్కరణకు అంతం లేదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. ప్రతిరంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని చెప్పారు. హైదరాబాద్​ నిజాం కళాశాలలో బయోటెక్నాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళిసై హాజరయ్యారు.

By

Published : Nov 15, 2019, 1:35 PM IST

Updated : Nov 15, 2019, 3:21 PM IST

'విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదు'

'విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదు'

విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభిప్రాయపడ్డారు. అమ్మాయిలంతా వివాహం అయ్యాక కూడా తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని సూచించారు.

హైదరాబాద్​ నిజాం కళాశాలలో బయోటెక్నాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళిసై హాజరయ్యారు. బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి-భవిష్యత్​ అవకాశాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.

రోజురోజుకూ జీవనసాంకేతిక రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయని తమిళిసై పేర్కొన్నారు. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి సదస్సులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణల వైపు కదం తొక్కాలని చెప్పారు.

Last Updated : Nov 15, 2019, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details