తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను స్వాగతిస్తున్నా..: గవర్నర్​ - telangana governor tamila sai news

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తాను స్వాగతిస్తున్నానని గవర్నర్​ స్పష్టం చేశారు. రాజ్​భవన్​లో ఈ-ఆఫీస్​ను తమిళిసై సౌందరరాజన్​ ప్రారంభించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని.. అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నానని గవర్నర్ తెలిపారు.

governor tamila sai
వ్యవసాయ బిల్లులను స్వాగతిస్తున్నా..: గవర్నర్​

By

Published : Oct 2, 2020, 7:40 PM IST

ప్రభుత్వానికి, ప్రజలకు సదా సంధానకర్తగా ఉంటానని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్​భవన్​ను ప్రజాసమస్యలకు.. వాటి పరిష్కారాలకు వంతెనగా వ్యవహరించేలా చూస్తానన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా రాజ్​భవన్​లో ఈ-ఆఫీస్​ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం దృశ్యమాధ్యమంలో సంభాషించారు.

డిజిటలైజేషన్​లో భాగంగా ప్రారంభించిన ఈ-ఆఫీస్ కాగిత రహిత, పర్యావరణహిత కార్యాలయంగా పనిచేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్​భవన్ కార్యక్రమాలు, ఇతరత్రా పనులను సురక్షితంగా, వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు.

రాజ్​భవన్​లో తనను కలిసిన సీఎం కేసీఆర్​.. రాజ్​భవన్​లో ఈ-ఆఫీస్​ను తీసుకురావటాన్ని స్వాగతించినట్లు తెలిపారు. సౌందరరాజన్​కు ధన్వంతరి అవార్డుకు ఎంపికవ్వటం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లును తాను స్వాగతిస్తున్నానని.. ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ, రైతులకు లాభించేలా ఉందని గవర్నర్ అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని.. అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నానని గవర్నర్ తెలిపారు.

వ్యవసాయ బిల్లులను స్వాగతిస్తున్నా..: గవర్నర్​

ఇవీచూడండి:'కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టంతో రైతులకు గడ్డు కాలమే...'

ABOUT THE AUTHOR

...view details