Oil Palm Expansion : రాష్ట్రంలో ఆయిల్పాం పంట సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో ఆయిల్పాం సాగుకు పుష్కలమైన అవకాశాలు ఉన్న దృష్ట్యా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఉద్యాన శాఖ చర్యలు ఊపందుకున్నారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలన్న లక్ష్యంతో అధికారులు కార్యచరణ మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో దాదాపు 1,000 ఎకరాల విస్తీర్ణంలో 27 హైటెక్ ఆయిల్పాం నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 వానాకాలంలో 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పాం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
పెరగనున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు..
పర్యవారణహితంగా ఆయిల్పాం పంట సాగులో నారు మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాల పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయబోతోంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం... బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ - ఆయిల్ఫెడ్ను ఆదేశించింది. సిద్దిపేటలో 60ఎకరాలు, మహబూబాబాద్లో 84 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు అత్యాధునిక ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ రానున్న 6మాసాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ ఏడాది రూ.950 కోట్లతో సూక్ష్మసేద్యం సాంకేతిక పరిజ్ఞానం రైతుల క్షేత్రాల్లో ఆయిల్పాం సాగు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామ్ఆయిల్ సాగు చేపట్టి... దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు చర్యలు చేపట్టాం. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. దానిని 40లక్షలకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 5లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2.5లక్షల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వెయ్యి ఎకరాల్లో హైటెక్ నర్సరీలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది రూ.950 కోట్లు ఖర్చుచేసి ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాం. -లోక వెంకటరామిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్
ఆ లోటును భర్తీ చేసేందుకు..