హైదరాబాద్లో ముంపు బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఖైరతాబాద్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలైన ఎంఎస్ మక్తా, రాజ్నగర్లో పర్యటించిన మంత్రి... బాధితులకు ప్రభుత్వం తరఫున రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నుంచి 4 లక్షల బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు.
పరిహారం పెంచేందుకు సుముఖం...
ఆర్థిక సాయం ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. విపత్తు వేళ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీఓలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేలా ప్రభుత్వానికి సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ బాధితులను పరామర్శించారు.
వరద బాధితులకు సర్కార్ బాసటగా నిలుస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో కలిసిరావాలని సూచించారు. అమీర్పేట డివిజన్ బస్తీనగర్లో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చెక్కులు అందించారు.