పల్లెప్రగతి పథకానికి నిధులు విడుదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి దఫాగా నిధులను విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత స్థానికసంస్థలకు నిధులు విడుదల చేశారు.
పల్లెప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - తెలంగాణ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి పథకానికి మొదటి దఫా నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
పల్లెప్రగతి
మొత్తం 273 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలకు 232.06 కోట్లు, మండల ప్రజాపరిషత్లకు 27.28 కోట్లు, జిల్లా ప్రజాపరిషత్లకు 13.63 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల