తెలంగాణ

telangana

ETV Bharat / state

పూర్తి వేతనాలు చెల్లించండి: ఉద్యోగుల ఐక్యవేదిక - telangana employees demands

ఏప్రిల్​ నెలలో పూర్తి వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరింది. గత నెల వేతనంలో కోత ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపింది.

telangana government employees demand full salaries for april month
పూర్తి వేతనాలు చెల్లించండి: ఉద్యోగుల ఐక్యవేదిక

By

Published : Apr 18, 2020, 7:23 PM IST

Updated : Apr 18, 2020, 7:47 PM IST

రాష్ట్రప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన జీవో 27ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక కోరింది. ఏప్రిల్ నెలలో పూర్తివేతనాలు, పింఛన్లు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి, సీఎస్​లకు ఈమెయిల్ ద్వారా వినతిపత్రాలను పంపించింది.

గత నెలలో వేతనాలు, పెన్షన్లలో కోత విధించడం వల్ల ఎన్జీవోలు, దిగువశ్రేణి ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారని ఐక్య వేదిక పేర్కొంది. ఉద్యోగుల రుణ వాయిదాల చెల్లింపులపై రిజర్వు బ్యాంకు మారటోరియం విధించినా.. బ్యాంకులు పట్టించుకోలేదన్నారు.

కోత విధించడం ఫలితంగా వైద్యం, మందుల కొనుగోలుకు డబ్బులు సరిపోక పింఛనుదారులు ఇబ్బంది పడ్డారన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఐక్య వేదిక కోరింది.

ఇవీచూడండి:కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్​డౌన్​పై కీలక చర్చ

Last Updated : Apr 18, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details