20:58 February 14
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈనెల 21 నుంచి మార్చి ఆఖరు వరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో తీసుకొచ్చిన 58, 59 జీవోల ప్రకారం 125 చ.గ ల్లోపు ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:'కాంగ్రెస్తో కష్టమే.. కేసీఆర్, స్టాలిన్తో కలిసి దిల్లీపై గురి!'