ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పు తెస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జీఎస్డీపీ వృద్ధి రేటును బట్టే రుణాలు వస్తాయని తెలిపారు. జీఎస్డీపీ పెరిగితే రుణ పరిమితి పెరుగుతుందన్నారు.
'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు' - బడ్జెట్పై ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందన
అవగాహన లేకే అప్పుల రాష్ట్రం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లఘించి ఎక్కడా అప్పు చేయలేదని స్పష్టం చేశారు.

తెెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
అంతర్గత వనరులు ఎలా పెంపొందించుకోవాలి, దుబారా ఎలా తగ్గించుకోవాలో ఓ కమిటీ వేసి సమాలోచనలు చేశామని మంత్రి హరీశ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో రూపొందిన బడ్జెట్... మాంద్యంలోనూ సంక్షేమానికి రూపాయి తగ్గించలేదని స్పష్టం చేశారు.
తెెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
- ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్