తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిపద్దుకు వేళాయే...

రాష్ట్ర బడ్జెట్​ను సీఎం కేసీఆర్ నేడు​ శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. పద్దుపై సాధారణ చర్చ శనివారం ఉంటుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆదివారం ఆమోదం పొందేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By

Published : Feb 22, 2019, 5:58 AM IST

Updated : Feb 22, 2019, 10:06 AM IST

సీఎం

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. పుల్వామాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాప తీర్మానాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్​, మండలిలో హోమంత్రి మహమూద్​ అలీ ప్రవేశపెట్టనున్నారు. కాసేపు వాయిదా అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను శాసన సభలో సీఎం ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ​ ప్రవేశపెడతారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాన్ని కూడా ప్రభుత్వం ఉభయ సభల ముందు ఉంచనుంది.
రెండో శాసనసభ కొలువు తీరిన నేపథ్యంలో సభా వ్యవహారాల సలహా సంఘాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రకటిస్తారు. బడ్జెట్​ ప్రవేశపెట్టిన అనంతరం శాసన సభ, మండలి బీఏసీలు సమావేశమవుతాయి. ఈ భేటీలో ఎజెండాను ఖరారు చేస్తారు.
రెండు బిల్లులకుఆమోదం
పంచాయతీ రిజర్వేషన్ల శాతాన్ని 50 శాతానికి పరిమితం చేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ స్థానంలో ఒక బిల్లును, జీఎస్టీ చట్ట సవరణకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆమోదం కోసం ఉంచనుంది.

Last Updated : Feb 22, 2019, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details