తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2020, 11:06 PM IST

ETV Bharat / state

'జీవో నంబరు 43ను సవరించాలి'

బడుగు బలహీన వర్గాలకు వైద్య, విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ సూచించారు. పీజీ కౌన్సెలింగ్​ను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Telangana BC Welfare Association president Jajula Srinivas Demanded for GO number 43 should be revised
జీవో నంబరు 43ను సవరించాలి

రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్ హక్కులను కాలరాస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్​లో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ పేరుతో దీక్ష నిర్వహించారు. వైద్య విద్యలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను పొమ్మనకుండా పొగ పెడుతోందన్నారు.

పీజీ కౌన్సెలింగ్​ను నిలిపివేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా జీవో నంబర్ 43ను సవరించి బడుగులకు న్యాయం జరిగే విధంగా నూతన జీవోను తీసుకురావాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రిజర్వేషన్ల స్ఫూర్తిని కాపాడాలన్నారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details