Telangana Assembly Sessions Live News Today 2023 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభ వేదికగా శ్వేతపత్రం ( White Paper on Power Sector) విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ సాగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రూ.10,000ల కోట్లను జగదీశ్రెడ్డి తిన్నారని ఆయన ఆరోపించారు
Minister Komatireddy On Yadadri Plant Corruption : టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister KomatiReddy VenkatReddy) ఆరోపించారు. గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారిని సంస్థలో నియమించి, డబ్బులు దోచేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. సబ్స్టేషన్లలో లాగ్ బుక్లు చూస్తే ఇదంతా తెలుస్తుందని చెప్పారు. తాను వెళ్లిన తర్వాత లాగ్ బుక్లు లేకుండా చేశారన్న మంత్రి కోమటిరెడ్డి రూ.10,000ల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్
Jagadish Reddy Demands Judicial Inquiry : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్రెడ్డి (JagdishReddy) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు. తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని జగదీశ్రెడ్డి వెల్లడించారు.