తెలంగాణ

telangana

'ఇందా ఈ డబ్బు తీసుకో - నాకే ఓటేస్తానని దేవుడి మీద ఒట్టేయ్'

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 7:46 AM IST

Telangana Assembly Election Temptations 2023 : ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. డబ్బు, మద్యంతో ఓటర్లను గుంపగుత్తగా కొనుగోలు చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ ఖాజాగుడాలో కోటి 60 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. జడ్చర్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కోసం తరలిస్తున్నట్లు గుర్తించారు. పరిగిలో అధికార పార్టీ నేత దేవుడిపై ప్రమాణం చేయించి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన వీడియోను ప్రత్యర్థులు బయటపెట్టారు. పరస్పర ఫిర్యాదులతో కొన్ని చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి.. నగదును స్వాధీనం చేసుకున్నారు.

Police Focus on Temptations in Elections
Telangana Assembly Election Temptations

పతాకస్థాయికి ప్రలోభాలు - దేవుడిపై ప్రమాణం చేయించి ఓటర్లకు డబ్బులు

Telangana Assembly Election Temptations 2023:పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో అభ్యర్ధులు తమకు పోలయ్యే ఓట్లపై దృష్టిసారించారు. డివిజన్ల వారీగా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు తటస్థ ఓటర్ల వివరాలు రాబడుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావటంతో గల్లీనాయకులు, చోటా నేతలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలతో.. మంతనాలు ప్రారంభించారు. తమ చేతిలో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తుగావేయిస్తామంటూ హామీనిస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభ్యరుల మధ్య నెలకొన్న పోటీ ఆధారంగా ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు.

Money Distribution in Telangana Elections 2023:ప్రలోభాలపర్వం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక నాయకులు, చోటామోట లీడర్లు.. ఇదే అదనుగా రంగంలోకి దిగారు. కులం, మతం, కాలనీ సంఘాల పేరిట బేరమాడుతున్నారు. అభ్యర్థుల నుంచి ఓటుకు 2000 నుంచి 5000 వరకు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మహేశ్వరం, చేవేళ్లలో ఓట్ల బేరాలు భారీఎత్తున సాగుతున్నట్టు సమాచారం.

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ

మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోనూ రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని సమాచారంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

ప్రలోభాలపై పోలీసుల నజర్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై కేసు నమోదు

Huge Amount Of Cash Seized in Hyderabad: హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోటి 60 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. ఖాజాగుడాలో పోలీసుల తనిఖీలు చేస్తున్న సమయంలో రెండు కార్లులో నగదును తరలిస్తున్న వ్యక్తులను గుర్తించారు. జడ్చర్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పరిగి నియోజకవర్గం పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి... ఓటర్లకు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేశారని సమాచారం. దేవుడి ఫోటోపై ప్రమాణం చేయించి డబ్బులిచ్చినట్లు ప్రత్యర్థులు వీడియో విడుదల చేశారు.

నిర్మల్ జిల్లా తానూరు మండలం బెళ్తారొడ చెక్‌పోస్ట్‌ వద్ద ఓ వ్యక్తి నుంచి 500 రూపాయల నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే..అవి చిన్న పిల్లలు ఆడుకునే నోట్లని గుర్తించారు. అతడు ఏ ఉద్దేశంతో నోట్లు తీసుకెళ్తున్నాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అక్రమంగా మద్యం తరలింపు - 384 లిక్కర్ బాటిల్స్ సీజ్

రాష్ట్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు - 570 కోట్ల విలువైన సొత్తు సీజ్

ABOUT THE AUTHOR

...view details