తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2019, 11:44 PM IST

ETV Bharat / state

సచివాలయ భవనాలను సందర్శించిన సాంకేతిక కమిటీ

ఇంజినీర్ ఇన్​ ఛీప్​లతో ఏర్పాటైన సాంకేతిక కమిటీ సచివాలయ భవనాలను పరిశీలించింది. ఈ కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించనుంది.

సచివాలయ భవనాలను సందర్శించిన సాంకేతిక కమిటీ

ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో ఏర్పాటైన సాంకేతిక కమిటీ సచివాలయ భవనాలను సందర్శించింది. సచివాలయ, శాసనసభ భవనాల సాంకేతిక అంశాలకు సంబంధించి ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో మంత్రివర్గ ఉపసంఘం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్ గణపతిరెడ్డి, సభ్యులు రవీందర్ రావు, మురళీధర్, సత్యనారాయణరెడ్డిల బృందం భవనాలను సందర్శించింది. నిర్మాణాల నాణ్యత, స్థితిగతులు, తదితర అంశాలను కమిటీ పరిశీలించింది. అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించనున్నారు.

సచివాలయ భవనాలను సందర్శించిన సాంకేతిక కమిటీ

ABOUT THE AUTHOR

...view details