త్వరలో జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ కోణంలో చూడొద్దని ప్రొ.నాగేశ్వర్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం తప్ప సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో టీం నాగేశ్వరరావు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పలు సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి.
పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారే అవకాశం లేదని ఆయన గుర్తు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఫలితాలు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా వస్తాయన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే 50 సంఘాలు తనకు మద్దతు ప్రకటించాయని తెలిపారు.