ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్, తెరాస బడుగు బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించనందునే... తెలుగుదేశం పార్టీ నుంచి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా... బరిలో నిలిచానని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, మిత్రుల మద్దతుగా ఉండడం మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలో బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మన ఓటు మనకే వేసుకుందాం పేరుతో.. బీసీ టైమ్స్ మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.