తెలంగాణ

telangana

By

Published : May 11, 2021, 5:21 PM IST

ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు తమ్మినేని వీరభద్రం లేఖ

సీఎం కేసీఆర్​కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఆశావర్కర్లు, అంగన్​వాడీలు, కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ సిబ్బందిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

Tammineni Veerabhadram's letter to CM KCR
Tammineni Veerabhadram's letter to CM KCR

తమ ప్రాణాలకు, కుటుంబాలకు ముప్పు అని తెలిసినా... కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆశావర్కర్లు, అంగన్​వాడీలు, ఔట్​సోర్సింగ్​ సిబ్బందిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు సీఎంకు లేఖను రాశారు.

ఆశావర్కర్లు, అంగన్​వాడీలు, కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. కరోనా సోకిన నాటి నుంచి టెస్టులు, మందులు, వ్యాక్సినేషన్​, కరోనా పేషెంట్స్​ను ప్రతిరోజూ మానిటరింగ్​ చేయడం లాంటి అన్ని విధులు వారు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడు వారిసేవలను కొనియాడుతుందని... కానీ వారికి అదనంగా సహాయం అందించడంలో మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details