ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలకు సంబంధించి గత 5 రోజులుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారని తెలిపారు. 70 సంవత్సరాల్లో జరగని రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమైందని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు విధించామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం - SRINIVAS YADABV
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
![రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3442753-thumbnail-3x2-tala-cp.jpg)
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం