ప్రచారంలో తలసాని సాయి కిరణ్ సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ సనత్నగర్లో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణలో 16 సీట్లు గెలిచి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్, భాజపాకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిగా ఏర్పడతాయని జోస్యం చెప్పారు. అప్పుడే రాష్ట్రాలకు నిధులు వచ్చి వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.