తెలంగాణ జేఏసీ ఉద్యోగులకు తెలియకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి అన్నారు. సమ్మె విషయం తమతో చర్చించి ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించేవాళ్లమని పేర్కొన్నారు. కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా సమ్మెకు వెళ్లి ఈరోజు మద్దతివ్వలేదనటం బాధాకరమన్నారు. రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు తమతో చర్చిస్తే తమ వైఖరిని చెబుతామన్నారు. ఈ నెల21న ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
'ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం' - ts rtc strike issue
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడం బాధాకరమని టీఎన్జీవో నేత రవీందర్రెడ్డి అన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు వచ్చి తమతో చర్చిస్తే తమ వైఖరేంటో చెబుతామన్నారు.
!['ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4738204-thumbnail-3x2-tngo-rk.jpg)
'ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం'