కరోనా సంబంధిత విశ్వసనీయ సమాచారం కోసం రూపొందించిన టీ కొవిడ్-19 యాప్ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఆరోగ్య, ఐటీశాఖల సంయుక్త భాగస్వామ్యంలో తీసుకొచ్చిన ఈ యాప్ కొవిడ్-19పై కచ్చితమైన సమాచారం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్కు చెందిన సిస్కో, క్వాంటెలా అనే స్టార్టప్స్ ఈ యాప్ను అభివృద్ధి చేశాయి. ఈ యాప్ కొవిడ్ కేసుల సంఖ్యతో పాటు.. వైరస్ భయాందోళనలు పోగొట్టే ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, దగ్గర్లోని టెస్ట్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు, డాక్టర్ అపాయింట్మెంట్లు, ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, జాగ్రత్తలు ఇలా అన్ని ఈ యాప్లో పొందుపరిచారు.
టీ కొవిడ్- 19 యాప్ను ఆవిష్కరించిన కేటీఆర్ - T-covid app updates
కరోనా వైరస్ సంబంధిత సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. టీ కొవిడ్-19 యాప్ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
![టీ కొవిడ్- 19 యాప్ను ఆవిష్కరించిన కేటీఆర్ ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6751159-401-6751159-1586603884258.jpg)
ktr